Skip to main content

Gavi Gangadhareshwara Temple - బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం

గవి గంగాదేవి ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవి పురంలో ఉన్నది. బెంగళూరు నగర నిర్మాత కెంప గౌడ, గవి గంగాదేశ్వర గుహాలయం నిర్మించాడు. గుడిలో ప్రధాన దైవం శివభగవానుడు. ఇందులో అరుదుగా కనిపించే, పూజించే అగ్ని దేవుని విగ్రహం ఉన్నది. ఈ అగ్ని దేవుని విగ్రహంతో పాటు మరో 33 విగ్రహాలు కూడా గుహాలయంలో ఉన్నాయి. ఒకే రాతి తో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళ, వాస్తు శైలి కలిగి ఉంది.

బెంగళూరులో ఉన్న వారికి ఈ ఆలయం గురించి తెలుసుంటుంది. కర్ణాటకలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయ దర్శనానికి విచ్చేస్తుంటారు. ఈ ఆలయంలోని అనేక అపురూపమైన సంగతులు చాలా మందికి తెలియదు. ఇంతట ప్రసిద్ది చెందిన దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం..

గుహలోపల శివుడు గుహలోపల శివుడు వెలసి ఉంటాడు కనుక శివుని తలలో గంగను అలంకరించుకోవడం వల్ల ఈ ఆలయానికి గవి గంగాధరేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఇంకా ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఒక పక్కగా చిన్న గుంత ఉంది. ఇందులో నిత్యం గంగాజలం ఊరుతూ ఉంటుంది. గంగా ప్రవాహం ఉండటం వల్లే ఇక్కడ దక్షిణామూర్తి గంగాధరేశ్వరుడిగా కొలువయ్యాడని ప్రతీతి.

ఈ గవి గంగాధరుడిని దర్శించడం వల్ల ఈ గవి గంగాధరుడిని దర్శించడం వల్ల ఆత్మలింగాన్ని దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం లభిస్తుంది. ఈ ఆలయం 16వ శతాబ్ధంలో నిర్మితమైనది. భారత దేశంలోని రాతి కట్టడాల్లో గవి గంగాధరేశ్వరుడి ఆలయం ఒకటిగా చెప్పవచ్చు.

ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏక శిలా శిల్పాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏక శిలా శిల్పాలున్నాయి. ఈ ఆలయాన్ని ఏక శిలా రాతితో కట్టడం జరిగింది. ఈ ఆలయం ఒకే నల్లరాతితో చెక్కిన అత్యధ్బుత శిల్ప కళాఖండం.

పూర్వకాలంలో పూర్వకాలంలో బరద్వాజ్ ముని గౌతమ మహర్షి ఇద్దరూ ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది. వారు ఇద్దరూ వేకువ జామునే వారణాసిలో పూజ ముగించుకుని మధ్యహన సమయంన గవిపురంలో పూజ చేసుకుని, సాయంత్రానికల్లా శివగంగలో మూడు సార్లు పూజను చేసేవారు.

ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని ఈ గవి పురంలో శివలింగం స్వయంగా వెలిసిందని చెబుతుంటారు. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ ముఖంగా ఉండటం విశేషం. సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఆశీనురాలై పూజలందుకుంటోంది.

సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు:
ప్రతి మకర సంక్రాంతి రోజున బెంగళూరులో గవి గంగాధరేశ్వర స్వామి సన్నిధానంలో సూర్య రశ్మి శివలింగాన్ని స్పర్శిస్తుంది. ఈ సుందర ద్రుశ్యాన్ని చూడటానికి ప్రజలు చుట్టుపక్కల నుండి వచ్చి వీక్షిస్తుంటారు. స్వయంగా సూర్యుడే ఈ సంక్రాంతి రోజున సాయంత్రం 5గంటల నుండి 5.20నిముషాల మద్యలో సూర్యుడు శివలింగాన్ని స్పర్శించి పూజిస్తాడు. ఈ ఆలయాన్ని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 :30 వరకు ఈ గుహాలయాన్ని దర్శించవచ్చు.

ఈ శివాలయంలో శివున్ని దర్శించాలంటే ముందుగా నందీశ్వరున్ని దర్శించి తర్వాత ఆయన కొమ్ముల మద్య నుండి శివున్ని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. నందీశ్వరుడు హిందూ దర్మానికి ప్రతీకగా ఉన్నాడు. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికి మరొకటి సుదర్శన చక్రానికి నిదర్శనంగా చెబుతారు.

లింగరూపంలో ఉన్న పరమేశ్వరున్ని దర్శించాలంటే, ముందుగా నందీశ్వరున్ని పువ్వులతో పూజించి తర్వాత ఎడమ చేతి వేళ్ళను ఆయన కొమ్ములపై ఉంచి గోపురంపై తల వుంచి నందీశ్వర కొమ్ముల మద్య నుండి శివ దర్శనం ఏకాగ్రతతో చేసుకోవాలి. ఇలా దర్శించడం వల్ల మనం కోరిన కోరికలు నిజం అవుతాయి.

గవి గంగాధరేశ్వర ఆలయంలో రెండు స్వరంగాలున్నాయి. ఒకటి కాశీ నుండి రావడానికి మరొకటి శివగంగకు వెళ్ళడానికి. పూర్వం భరద్వాజముని, గౌతమ మహర్షి కాశీ నుండి స్వరంగ మార్గం గుండా గవి పురానికి వచ్చి ఇక్కడ పూజ ముగించుకుని తిరిగి సాయంత్రం పూజకు శివగంగకు స్వరంగం గుండా వెళ్లేవారని మన పురాణాలు చెబుతున్నాయి.

భారతదేశంలో భారతదేశంలో ప్రాచీన గ్రుహాంతర దేవాలయాలలో గవి గంగధేశ్వర దేవాలయం ఒకటి.

ఆలయ విశిష్టత: 
ఈ ఆలయంలోని ఉద్భవ మూర్తి యందు ఒక విశిష్టత ఉన్నది. అదేంటంటే లింగ భాగం వేరుగా సోమ సూత్రం వేరుగా ఉంటుంది. లింగ భాగం అనగా పరమేశ్వరునికి ప్రతీక. అయితే సోమ సూత్రం పార్వతీ దేవి అని చెప్పవచ్చు.

ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు లింగరూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే, కైలాసంలోని పార్వతీపరమేశ్వరులను దర్శించినంత పుణ్యం కలుగుతుంది భక్తుల నమ్మకం. ఏకాంతంగా ఒకే దేవాలం ఉంటే దానిని దేవాలయం అనరు. ఈ ఆలయంలో గణపతి, సుబ్రమణ్యేశ్వర స్వామి, చండికేశ్వర, నందీశ్వర, పార్వతీదేవి, నవగ్ర ఉపాలయాలు వంటి పరివార దేవుళ్ళు ఉన్నారు.

గర్భ గుడి ప్రాకారం చుట్టూ ఇంద్రాణి, వారాహి, వైష్ణవి, చాముండి, కౌమారి, మహేశ్వరి, బ్రాహ్మీ మొదలైన సప్తమాతృకల ఏకశిలా విగ్రహాలున్నాయి.

కార్తీక మాసంలో ఇక్కడ స్వామికి విశేష అలంకారాలు, వివిధ రకాల అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మాఘమాసంలో బ్రహ్మరథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటితో పాటు విశిష్ట దుర్గాహోమాలు, చండికా హోమాలు, రుద్రాభిషేకాలు, నవగ్రహ శాంతులూ మొదలైన కార్యక్రమాలను ప్రతి రెండు సంవత్సరాలకొకసారి నలభూ ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.

ప్రాతహ: కాలంలో కాశీలో పూజచేసి స్వరంగ మార్గాన గౌతమ ముని, భరద్వాజ మునులు మద్యహ్నాం గవి పురానికి వచ్చే వారు. మద్యహ్నాం పూజ ముగించుకుని, తిరిగి సాయంత్రం శివ గంగకి ఈ ఆలయం స్వరంగ మార్గం ద్వారా వచ్చేవారు.

ఎలా వెళ్ళాలి? 
గవి గంగాధరేశ్వరుడిని చేరుకోవడానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులోని ప్రధాన బస్ స్టేషన్, రైల్వేస్టేషన్లు ఎదురెదురుగానే ఉంటాయి. అక్కడి నుండి లోకల్ బియంటిసి బస్సుల్లో ప్రయాణించి రామకృష్ణ ఆశ్రమం దగ్గర దిగి, ఈ ఆలయానికి నడిచి వెళ్లొచ్చు. విమాన మార్గంలో : ఎకిర్ పోర్ట్ కి సుమారు 35కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

Source: nativeplanet

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.