Skip to main content

Posts

Showing posts from 2022

భక్తి మార్గాలు

భక్తి మార్గాలు ఎన్ని? అవి ఏమిటి? వాటి గురించి వివరించగలరా? మోక్షం పొందడానికి నవవిధ భక్తి మార్గాలు మన పురణాలలో ఈ భక్తి మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. మొత్తం తొమ్మిది భక్తి మార్గాలు ఉన్నాయి. వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు. అంటే ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని, దాన్ని వదలకుండా సాధన చేస్తే ఆ భగవంతుని సన్నిధిని చేరుకోవడం సులభం అన్నమాట. దీని గురించి సద్గురు షిరిడి సాయిబాబా కూడా వివరించారు. తన శిష్యురాలు, తాను తల్లిగా భావించే బాయిజాకి అవతార సమాప్తి అయ్యే కొన్ని గంటల ముందు 9 నాణాలను ఇచ్చి, ఈ నవవిధ భక్తి గురించి, దాని ద్వారా ముక్తిని సాధించే మార్గాలను తెలిపారని సాయి సచ్చరిత్ర ద్వారా తెలుస్తోంది. 'శ్రవణం కీర్తన విష్ణోః స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం' అనేవి నవవిధ భక్తి మార్గాలు. శ్రవణం : ఎల్లప్పుడూ భగవంతుని కథలు, లీలా విశేషాలను వినడం, చదవడం వల్ల ఆ స్వామికి దగ్గరగా నివసిస్తూ ఉండే మార్గం ఇది. ఈ మార్గం ద్వారా భగవంతుని చేరినవారిలో అగ్రేసరుడు పరీక్షిత్. కీర్తన : ఆ భగవంతునిపై కీర్తనలు రచించడమో, లేదా అలా రచించినవారి కీర్తనలను ఎప్పు

Kanipakam Vinayaka Temple - కాణిపాకం వినాయకుడి ఆలయం

మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. మరి ఈరోజు మనం కాణిపాకం వినాయకుడి చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం మీకు బాగా తెలిసేఉంటుంది, చాలా సార్లు వెళ్లి ఉంటారు కూడా.. మరి  ఈ ఆలయం యొక్క చరిత్ర,  వాటివిశేషాలు మీకు తెలుసా…?  చాలా వరకూ ఎవరికీ తెలియవు. ఈ దేవాలయం లో ప్రత్యేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా… అయితే రండి మరి విశేషాలేమిటో చూద్దాం.. తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పకుండా చాలామంది దర్శించుకునే వినాయక దేవాలయం కాణిపాకం. ఈ వినాయకుడు రోజురోజుకి పెరిగి భగవంతుని మహిమ ఎటువంటిదో చూపిస్తున్నాడు. మరి ఆ కాణిపాక వినాయకుని ఆలయచరిత్ర నిజానిజాలేంటో మీకు తెలుసా? తెలుసు కానీ అంత వివరంగా తెలీదు కదా. మరెందుకాలస్యం ఆ కాణిపాకం వినాయకుని గూర్చి వివరంగా తెలుసుకుందాం. హిందువులు ఎలాంటి శుభకార్యం చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుణ్ణి. వినాయకుణ్ణి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం. వినాయకుడనగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది కాణిపాకం. వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం వున్న క్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. ఇక్కడ వినా

Jwala Muhki Temple - జ్వాలాముఖి ఆలయం

కాంగ్రా లోయలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం 'జ్వాలముఖి'. ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 610మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా -ధర్మశాల హైవేపై, కాంగ్రా పట్టణానికి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఇది 51శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలేకాక, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారి అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా ముఖి ఆలయం. జ్వాలాముఖి గురించిఅనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దక్షయజ్ఝం తర్వాత సతీదేవి తనను తాను దహించివేసుకుందేనీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు.

Jogulamba Temple జోగులాంబ దేవాలయం - అలంపురం

అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు. అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న అలంపురం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవది. అలాగే, ఈ క్షేత్రంలో నవ బ్రహ్మలు కొలువై ఉన్నారు. కొన్ని వందల ఏళ్ల పాటు పుణ్య క్షేత్రంగా విరాజిల్లిన ప్రదేశం ఇప్పుడు శిధిలావస్థకు చేరుకుంది. దక్షిణ కైలాసం గా భక్తుల నీరాజనాలు అందుకున్న ఆ చారిత్రక పట్టణం ఇప్పుడు చరిత్ర పుటలకే పరిమితం కావచ్చు కానీ అప్పట్లో శిల్ప సంపదకు నిలువెత్తు దర్పణంలా సాక్షాత్కరించింది. స్థల పురాణంలో హేమలాపురం, ఎల్లమ్మపురంగా ఉండేది. అలంపూర్‌ దేవాలయంలో తోటను ఆనుకొని ఉన్న గుంతలో తవ్వకాలు జరిపినప్పుడు శతవాహనంలో నాణ్యాలు, పూసలు, దక్షిణవర్త శంఖం, అందమైన గాజులు, నలుపు, ఎరుపు రంగు పూత వేయ బడిన చిన్న మట్టి పాత్రలు, నలుచెదరం 21 అంగుళాల పొడవు వెడల్పు ఉన్న ఇటుకలు బయటపడడం వల్ల ఈ ప్రదేశంలో శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం నిర్మించారు. బాదామి చాళుక్యుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ప్రదేశం అలంపూర్. బాద

Sri Kashi Bugga Temple - కాశీ బుగ్గ శివాలయం

శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన్న ఉన్న కాశీ బుగ్గ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 1822లో రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి 24x7 నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి.. ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్తారు. ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్‌కుమార్ భరత్ లాల్‌జీ ట్రస్టీగా ఉన్నారు. రోజూ తెల్లవారుజామున 3 గంటలకు పాములు ఆలయంలో

Kamandal Ganapathi Temple - శ్రీ కమండల గణపతి దేవస్థానము

కమండల గణపతి తీర్ధం: బ్రహ్మనదిలో స్నానం చేస్తే శనిదోషం తొలగిపోతుంది హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి.  ఏ పని మొదలు పెట్టినా విఘ్నలు కలగకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడమని కొరుకుతూ వినాయకుడిని భక్తితో పూజిస్తాం. అయితే ఇలా గణేశుడికి పూజలు చేసేది...మునులు, ఋషులు మానవులే కాదు.. దేవతలు సైతం పూజలను చేస్తారు. అలా జగన్మాతతో గణేశుడు పూజలందుకున్న కమండల గణపతిగా పూజలందుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు పెట్టింది పేరు. కర్ణాటక రాష్ట్రంలో చూడాల్సిన అనేక ప్రదేశాల్లో చిక్క మంగళూరు ఒకటి. చిక్కమగళూరు ప్రకృతి అందాలు..కాఫీ తోటల ఘుమఘుమలు..సెలయేళ్ల గలగలలే కాకుండా ప్రకృతి ఒడిలో ఆలయాలెన్నో భక్తుల్లిన విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ నీటిని సేవిస్తే చాలు..అనేక రుగ్మతలు యాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడవునా అక్కడ నీటి ధార పెల్లుబుకుతోంటుంది. అదే తుంగ ఉపనది బ్రహ్మ. అక్కడి తీర్థాన్ని స్వీకరించి అనారోగ్య సమస్యల్ని అనారోగ్య సమస్యలెంటిని దూరం చేసుకోవడం కొరకు ఇక్కడకు అనేక మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం.. ఈ ఆలయంల

Sri Bugga Ramalingeswara Temple - శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం

అందమైన శిల్ప కళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురం కు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్నది తాడిపత్రి. ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు. క్రీ .శ 1495 ప్రాంతంలో గుత్తి - గండికోట పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు (కొన్ని సంఘటనల అనతరం ) నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు. నీటి బుగ్గ ఉన్న ప్రాంతం లో ఉండటం చేతశివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు పిలువటం వాడుక అయినది. ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సం. రం లో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ, పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. ఇది పెన్నా నది పడమటి తీరం లో ఉన్నది. ఆలయానికి శిధిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి. శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగం లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురం లో బాగం గానే వినాయకుడికి చిన్నపాటి మందిరం ఉంట

Jambukeswaram Temple జంబుకేశ్వరం

జంబుకేశ్వరం జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో రెండవది. తమళనాడులోని తిరుచ్చికి 11 కి.మీ. దూరంలో ఉన్నది. ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రమని కూడా అంటారు. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు(నేరేడు చెట్లు) ఉండటం చేత జంబుకేశ్వరం అని పేరు వచ్చిందంటారు జంబుకేశ్వరుడి ఆలయం దాదాపు 18 వందల సంవత్సరాల నాటిది. ఆలయం లోపల ఐదు ఆవరణలు ఉన్నాయి. ఐదోదాన్ని విభూది ప్రాకారంగా పిలుస్తారు. ఇది రెండు అడుగుల వెడల్పుతో 25 అడుగుల ఎత్తులో సుమారు మైలు దూరం వరకూ వ్యాపించి ఉంది. నాలుగో ఆవరణలో 796 స్తంభాలు, విశాలమైన హాలు ఉన్నాయి. గర్భగుడి పశ్చిమ ముఖం అంతర్భాగమైన రాతి కిటికీలోంచి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం రెండు  కథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఇతిహాసం మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తుంగా ఒకసారి శంభుడికి శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన కోరిక అయినా ప్

Mahanandi Temple Guide - మహానంది

మహానంది - మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం !! అప్పుడప్పుడూ అద్భుతాలు కొన్ని మన కళ్లును మనమే నమ్మలేనట్టు చేస్తాయి. దేవుడి సన్నిధిలో ఏదైనా వింతగా అనిపిస్తే.. అది ఆయన మహత్యమే అని భక్తులు నమ్ముతారు. అలాంటి మహాద్భుతమే మహానంది క్షేత్రంలో చోటు చేసుకుంది. దీంతో భక్తులు పరవశించి పోతూ.. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు, అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో మనం కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకున్నాం. అయితే మనకు తెలియని మిస్టరీలు చాలానే ఉన్నాయి. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తీర్థంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహానంది ఆలయ విశిష్టత, ఇక్కడ ఉండే ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... నంద్యాల (14 కి.మీ.ల దూరంలో) సమీప క్షేత్రాలు : శ్రీశైలం (172 కి.మీ.), అహోబిలం (69 కి.మీ.) మహానంది ఆంధ్ర ప్రదే