Skip to main content

Posts

Showing posts from January, 2022

Sri Kashi Bugga Temple - కాశీ బుగ్గ శివాలయం

శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో మూసీ నది తీరాన్న ఉన్న కాశీ బుగ్గ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 1822లో రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి 24x7 నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి.. ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్తారు. ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్‌కుమార్ భరత్ లాల్‌జీ ట్రస్టీగా ఉన్నారు. రోజూ తెల్లవారుజామున 3 గంటలకు పాములు ఆలయంలో

Kamandal Ganapathi Temple - శ్రీ కమండల గణపతి దేవస్థానము

కమండల గణపతి తీర్ధం: బ్రహ్మనదిలో స్నానం చేస్తే శనిదోషం తొలగిపోతుంది హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి.  ఏ పని మొదలు పెట్టినా విఘ్నలు కలగకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడమని కొరుకుతూ వినాయకుడిని భక్తితో పూజిస్తాం. అయితే ఇలా గణేశుడికి పూజలు చేసేది...మునులు, ఋషులు మానవులే కాదు.. దేవతలు సైతం పూజలను చేస్తారు. అలా జగన్మాతతో గణేశుడు పూజలందుకున్న కమండల గణపతిగా పూజలందుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం పర్యాటక ప్రదేశాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు పెట్టింది పేరు. కర్ణాటక రాష్ట్రంలో చూడాల్సిన అనేక ప్రదేశాల్లో చిక్క మంగళూరు ఒకటి. చిక్కమగళూరు ప్రకృతి అందాలు..కాఫీ తోటల ఘుమఘుమలు..సెలయేళ్ల గలగలలే కాకుండా ప్రకృతి ఒడిలో ఆలయాలెన్నో భక్తుల్లిన విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ నీటిని సేవిస్తే చాలు..అనేక రుగ్మతలు యాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏడాది పొడవునా అక్కడ నీటి ధార పెల్లుబుకుతోంటుంది. అదే తుంగ ఉపనది బ్రహ్మ. అక్కడి తీర్థాన్ని స్వీకరించి అనారోగ్య సమస్యల్ని అనారోగ్య సమస్యలెంటిని దూరం చేసుకోవడం కొరకు ఇక్కడకు అనేక మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం.. ఈ ఆలయంల

Sri Bugga Ramalingeswara Temple - శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం

అందమైన శిల్ప కళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురం కు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్నది తాడిపత్రి. ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు. క్రీ .శ 1495 ప్రాంతంలో గుత్తి - గండికోట పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు (కొన్ని సంఘటనల అనతరం ) నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు. నీటి బుగ్గ ఉన్న ప్రాంతం లో ఉండటం చేతశివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు పిలువటం వాడుక అయినది. ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సం. రం లో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ, పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. ఇది పెన్నా నది పడమటి తీరం లో ఉన్నది. ఆలయానికి శిధిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి. శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగం లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురం లో బాగం గానే వినాయకుడికి చిన్నపాటి మందిరం ఉంట

Jambukeswaram Temple జంబుకేశ్వరం

జంబుకేశ్వరం జంబుకేశ్వరం పంచభూత క్షేత్రాలలో రెండవది. తమళనాడులోని తిరుచ్చికి 11 కి.మీ. దూరంలో ఉన్నది. ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రమని కూడా అంటారు. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు(నేరేడు చెట్లు) ఉండటం చేత జంబుకేశ్వరం అని పేరు వచ్చిందంటారు జంబుకేశ్వరుడి ఆలయం దాదాపు 18 వందల సంవత్సరాల నాటిది. ఆలయం లోపల ఐదు ఆవరణలు ఉన్నాయి. ఐదోదాన్ని విభూది ప్రాకారంగా పిలుస్తారు. ఇది రెండు అడుగుల వెడల్పుతో 25 అడుగుల ఎత్తులో సుమారు మైలు దూరం వరకూ వ్యాపించి ఉంది. నాలుగో ఆవరణలో 796 స్తంభాలు, విశాలమైన హాలు ఉన్నాయి. గర్భగుడి పశ్చిమ ముఖం అంతర్భాగమైన రాతి కిటికీలోంచి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం రెండు  కథలు ప్రాచుర్యములో ఉన్నాయి. ఇతిహాసం మొదటి కథ ప్రకారం ఇక్కడ శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తుంగా ఒకసారి శంభుడికి శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు. శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన కోరిక అయినా ప్

Mahanandi Temple Guide - మహానంది

మహానంది - మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం !! అప్పుడప్పుడూ అద్భుతాలు కొన్ని మన కళ్లును మనమే నమ్మలేనట్టు చేస్తాయి. దేవుడి సన్నిధిలో ఏదైనా వింతగా అనిపిస్తే.. అది ఆయన మహత్యమే అని భక్తులు నమ్ముతారు. అలాంటి మహాద్భుతమే మహానంది క్షేత్రంలో చోటు చేసుకుంది. దీంతో భక్తులు పరవశించి పోతూ.. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు, అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో మనం కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకున్నాం. అయితే మనకు తెలియని మిస్టరీలు చాలానే ఉన్నాయి. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తీర్థంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహానంది ఆలయ విశిష్టత, ఇక్కడ ఉండే ఆలయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... నంద్యాల (14 కి.మీ.ల దూరంలో) సమీప క్షేత్రాలు : శ్రీశైలం (172 కి.మీ.), అహోబిలం (69 కి.మీ.) మహానంది ఆంధ్ర ప్రదే