Skip to main content

Posts

Sri Vinaayaka Vratham శ్రీ వినాయక వ్రతం విధానం

శ్రీ వినాయక వ్రతం విధానం ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ వినాయకునికే. గణనాధుని అనుగ్రహాం పొందితే అన్ని కార్యాల్లోనూ విజయం సిద్దిస్తుంది. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు. పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, గరిక, పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు. వ్రత విధానం ఒక పీటపై బియ్యం పోసి, తమలపాకు చివర తూర్పు వైపు ఉండునట్లు పెట్టి, దానిపై పసుపుతో గణపతిని చేసి ఉంచవలెను. శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పువ్వులు, పండ్లతో అలంకరించవలెను. ఆ తర్వాత, రాగి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లుపోసి, పైన టెంకాయ (కొబ్బరికాయ), జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. ఆచమనం : ఓం కేశవాయ స్వాహాః నారాయణాయ స్వాహాః మాధవాయ స్వాహాః (అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని
Recent posts

Padaharu Kudumula Taddi (Nomu) పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది)

పదహారు కుడుముల నోము (పదహరు కుడుముల తద్ది) పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్ లో మహిళను ఆచరించే నోము . సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు. విధానం ప్రతీ సంవత్సరం బాధ్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి ) నాడు తలస్నానం చేసి 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ రవిక ఉంచి పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది. మరొక విధానం రెండు కొత్త చేటలు తీసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక చాటలో పదహారు కుడుములు పసుపు కుంకుమ పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ఒక ముతైదువుకు వాయనమివ్వాలి నోము కథ పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని  ఆ కన్య చెప్పగా విని కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది. వెంటనే యింటికి వెళ్ళి  ఆ నోమును యధోక్తముగా చేస

Sankatahara Chaturdhi - సంకటహర చతుర్ది వ్రతం

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి  అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం  అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.  ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం  ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.  ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జ

Laksha Vattula Nomu - లక్షవత్తుల నోము

పార్వతి ఆడవారి దోషాలను లెక్కిస్తూ పరమేశ్వరుడికి ఈ విధంగా వివరిస్తుంది ‘‘అన్న, తండి వంటి వావివరుసలు లేకుండా అందమైన మగాడు కనపించగానే స్త్రీలయోని వేడి తగిలిన నెయ్యిలా ద్రవిస్తూ వుంటుంది. అంతేకాదు ఇతర అనేక రహస్య కృత్యాలు అనేక విధాలుగా వున్నాయి. ఇతరుల ఇళ్లలో ఎక్కువ సమయం వుండటం, భర్తతో కఠినంగా మాట్లాడటం, గర్భస్రావం, శిశుహత్య, పెళ్లయిన తరువాత కూడా ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఎక్కువగా అసత్యాలు పలకడం, అత్తమామలు-బంధుత్వాలతో అమర్యాదగా ప్రవర్తించడం, దుర్మార్గం చేయడం, శిశుహత్య, క్రోధం పెంచుకోవడం ఇలా ఒకటేంటి మొత్తం పాపాలా పుట్టగా కలిగి వున్న స్త్రీలు చాలామంది వున్నారు. అజ్ఞాతంగా వచ్చిన పాపాలు అంటుకున్నవారు కూడా చాలామంది వున్నారు. ఇటువంటి మహిళలు తమ పాపాలను తుడుచుకోవడానికి, తరించిపోయేందుకు ఏదైనా వ్రతం వుందా’’ అని శివుడిని కోరుతుంది. అప్పుడు శివుడు ఆమె ‘‘లక్షవొత్తుల నోము’’ వ్రతానికి సంబంధించిన విధివిధానాలను, ఉద్యాపనాదులు వివరిస్తాడు. పార్వతి ‘‘ఈ నోమును అంతకుముందు ఎవరు చేసేవారు?’’ అని కోరగా శివుడు దానికి సంబంధించిన ఒక కథను ఈ విధంగా వివరిస్తాడు. ‘‘పూర్వం ఒకనాడు ఆర్యవర్త దేశంలో కాంత అనే ఒక వేశ్య వ

Puranas and Shastras - ఎటువంటి సమయాలలో వేదాలు, పురాణ, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు చదువకూడదు

ఎటువంటి సమయాలలో వేదాలు, పురాణ, శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు చదువకూడదు అంటారు, It is said that scriptures related to Vedas, Puranas and Shastras should not be read at any time పాడ్యమి, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధి కాలాలలో, శ్రాద్ధ భోజనాలు ఈ సమయాలలో చదువుకూడదు. ఈవేళల్లో చదువుకి ఒక రోజు సెలవు పాటించాలి. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినప్పుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప ఉల్కాపాత సమయాల్లో చదవటం ఆపేయాలి. శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆక్షణం నుండి మూడు రోజులు వరకు చదువకూడదు. ఉత్సవాలకు, శక్ర ధ్వజం దిగినప్పుడు, ఏడుపులు పెడబొబ్బలు దగ్గరలో వినబడుతున్నప్పుడు, శవం లేచినప్పుడు తాత్కాలికంగా చదువకూడదు. అపవిత్ర స్థలంలో, అపవిత్రంగా ఉన్నప్పుడు, మాటిమాటికి ఆకాశం మెరుస్తున్నప్పుడు, మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల, పలుమార్లు ఉరుములు వినబడినప్పుడు, జలమధ్యంలో ఉన్నప్పుడు, అర్థరాత్రి వేదశాష్త్రాలను చదువకూడదు. పరుగెడుతూ కాని, మద్యం వాసన వస్తున్న వ్యక్తి ప్రక్కన ఉన్నప్పుడు గాని, గాడిద, ఒంటె, నౌక, గుర్రం, చెట్టు, పర్వతం, మొదలైన వాటిపై కూర్చున్నప్పుడ

Planting a Tree - ఏ చెట్టు నాటితే ఎటువంటి ఫలితం వస్తుంది

ఏ చెట్టు నాటితే ఎటువంటి ఫలితం వస్తుంది Planting any tree will produce any result వీటిలో ఒక్కో వృక్షం నాటితే ఒక్కోరకమైన ఫలితం వస్తుంది. 1. పాల చెట్టు  -  ఆయుర్దాయాన్ని పెంపొందిస్తుంది. 2. నేరేడు చెట్టు - ఆడపిల్ల సంతానాన్ని ప్రసాదిస్తుంది. 3. దానిమ్మ చెట్టు - ఉత్తమమైన, అనుకూలవతి అయిన భార్యనిస్తుంది. 4. రావిచెట్టు -  సకలరోగాల్ని ప్రసాదిస్తుంది. 5. మోదుగ చెట్టు -సంపదల్ని ప్రసాదిస్తుంది. 6. ఊడుగచెట్టు - వంశాన్ని వృద్ధి చేస్తుంది 7. చండ్ర వృక్షం - వ్యాధుల్ని నిర్మూలిస్తుంది 8. వేప చెట్టు  -  సూర్యుడికి ప్రీతికరం, ఆరోగ్య ప్రదం. 9. మారేడు  - పరమేశ్వరానుగ్రహాన్ని కలిగిస్తుంది. 10. పాటలీవృక్షం  -  పార్వతీదేవికి ప్రీతికరమైనది. 11. మొల్ల వృక్షం  -  గంధర్వులతో సమాగమం. 12. మంజుల వృక్షం - శత్రువుల్ని, దొంగల్ని కూలుస్తుంది. 13. చందన వృక్షం -  ఐశ్వర్య ప్రదం, పుణ్యప్రదం. 14. సంపెంగ . -  సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది. 15. కరీర (వెదురు)వృక్షం  -  పరస్త్రీల సమాగమాన్నిస్తుంది. 16. తాటి చెట్టు  -  సంతానాన్ని నశింపచేస్తుంది. 17. పొగడచెట్టు  -  కులవర్థకంగా ఉపయోగపడుతుంది. 18. కొబ్బరి చెట్టు  -  బహ

9 incarnations of Lord Hanuman - ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి.

ఆంజనేయుడికి మొత్తం ఎన్ని అవతారాలు ఉన్నాయి. How many incarnations did Anjaneya have? సేకరణ (పరాశర సంహిత) ఆంజనేయునికి మొత్తం చాలా అవతారాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తొమ్మిది అవతారాలను పరాశర సంహిత వివరించింది. 1.) ప్రసన్నాంజనేయ అవతారం స్వామి ఈ అవతారంలో భక్తులకు అభయం ఇస్తూ గద క్రిందకు ఉంటుంది. 2.) వీరాంజనేయ అవతారం మైందుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు 3.)వింశతిభుజ అవతారం ఈ అవతారంలో స్వామికి ఇరవై చేతులు ఉంటాయి. ఈ అవతారం వల్లే స్వామికి భవిష్యద్బహ్మ అయ్యే వరం వచ్చింది 4). పంచముఖ ఆంజనేయ అవతారం సీతమ్మతల్లి శతకంఠ రావణుడిని వధించే సమయంలో స్వామి ఈ అవతారం ధరించాడు. ఈ అవతారంలో స్వామికి ఐదు ముఖాలుంటాయి. 5). అష్టాదశభుజాంజనేయ అవతారం ఈ అవతారంలో స్వామికి 18చేతులు ఉంటాయి. మృత సంజీవని విద్యకు అధిపతి. 6.) సువర్చలాంజనేయ అవతారం ఈ అవతారంలో స్వామి భార్య అయిన సువర్చలా దేవితో కలిసి ఉంటాడు. 7). చతుర్భుజాంజనేయ అవతారం. ఈ అవతారంలో స్వామి నాలుగు చేతులతో ఉంటాడు. కపిలుడు అనే భక్తుడిని అనుగ్రహించడానికి స్వామి ఈ అవతారం ధరించాడు. 8). ద్వాత్రిశభుజాంజనేయ అవతారం ఈ అవతారంలో స్వామికి  32 చేతులు, మూడు తల