Skip to main content

కేరళ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం Sri Padmanabhaswamy Temple

శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం


లోకంలో సంభవించే విపత్తులను అడ్డుకునేందుకు ఆ పరంధాముడు పలు అవతారాలు ఎత్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేశాడు. అనంతమైన ఆ పరమాత్ముడు స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీ అనంత పద్మనాభక్షేత్రం. మన దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో అనంతపద్మనాభ స్వామి ఆలయం ఒకటి. కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో ఉన్న ఈ దివ్యాలయం దేశంలో అత్యంత ఎక్కువ సంపదలున్న ఆలయంగా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదిగా ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి.
బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్టు శ్రీమద్ భాగవతం తెలుపుతోంది. స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియగం ప్రారంభమైన రోజున ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ద్వాపరయుగంలో ఈ ఆలయాన్ని ఫాల్గుణం అని పిలిచేవారు. ఆ కాలంలో బలరాముడు ఈ దేవాలయాన్ని దర్శించి, ఇక్కడున్న పద్మ తీర్ధంలో స్నానం చేసినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయ వైశిష్ట్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాత నమైనది. ఈ ఆలయం పేరు మీదే తిరువనంత పురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టు కున్నారు. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ‘తిరు అనంత పురం’ అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయమని అర్ధం. ఆ స్వామి ఇక్కడ కొలువై ఉండడం వల్లనే ఈ నగరానికి తిరువనంతపురమనే పేరు వచ్చింది. అనంతపురం, శయనంతపురం అనే పేర్లతో కూడా ఈ నగరాన్ని పిలుస్తారు.
తొలినాళ్లలో ఆలయాన్ని విస్తరించేందుకు రాజా మార్తాండవర్మ ఇతోధికంగా కృషి చేశారు. ఆయన హయాంలోనే మూరజపం, భద్రదీపం అనే పూజా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అనంతరం వారి వంశంలో వచ్చిన పాలకులు కూడా స్వామివారి దాసులుగా వుండి అనంతమైన సంపదను పరిరక్షించారు. ఆలయంలోని కుడ్యకళ ఆకట్టుకుంటుంది. కేరళ రాష్ట్రంలోని పదకొండు దివ్య ప్రదేశాలలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒకటని తమిళ ఆల్వార్ ప్రబంధ గ్రంధాలలో వుంది. బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. ఎనిమిదవ శతాబ్దపు ఆళ్వార్ కవి ‘నమ్మాళ్వార్‘ పద్మనాభ స్వామి దేవాలయం గురించి పొగడుతూ, నాలుగు శ్లోకాలను, ఒక ఫల శృతిని తన రచనలలో పొందుపరిచారు. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల -ఏడంతస్తుల గోపురం పునాదులు 1566లోనే పడ్డాయి. ‘పద్మ తీర్థం‘ అనే విశాలమైన పుష్కరిణి ఉంది. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది.
ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది. తూర్పు దిక్కుగా వున్న ప్రధాన ద్వారం సమీపంలో, గోపురం కింది భాగానున్న మొదటి అంతస్తును ‘నాటక శాల’ అని పిలుస్తారు. ఈ ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో నిక్షిప్తం చేశారు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా వాటిని తెరచి చూడలేదు. స్వాతంత్య్రా నంతరం స్థానిక ఆలయాలన్నింటిని ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణ కింద వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరధామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు.
ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాల కొద్ద్దీ బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు, గొలుసులు బయల్ప డ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణేలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లభించాయి. బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.
విగ్రహం
మూలవిరాట్టును మూడు ద్వారాల్లో నుంచి దర్శించాలి. స్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడంతో తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి వీక్షించాలి. రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో 1208 సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రోజుల్లో 4వేల శిల్పకారులు, 6 వేల మంది కార్మికులు, నూరు ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలోని పలు కళాకృతులను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.
ఆది శేషునిపై పవళించినట్ల్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.
ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో అంటే అనంతశేషుడి తల్పం మీద యోగనిద్రలో దర్శనమిస్తాడు. స్వామి తూర్పు ముఖంగా, భుజంగశయనంగా దర్శనమిస్తాడు. ఇక్కడ అమ్మవారు శ్రీహరి లక్ష్మీతాయారుగా నీరాజనాలందుకుంటోంది. ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం.

సౌందర్యం మరియు ఆర్కటెక్చర్
దేవాలయంలో రాతి మరియు కంచుతో చేసిన కళారూపాలు కనిపిస్తుంది. దేవాలయం లోపలి భాగంలో అందమైన పెయింటింగ్‌లు మరియు మురల్ చిత్రాలుంటాయి. వీటిలో పవళించే భంగిమలో ఉండే విష్ణుమూర్తి, నరసింహ స్వామి ( విష్ణుమూర్తి యొక్క నరసింహావతారం), గజపతి మరియు గజపతి యొక్క లైఫ్ సైజ్ చిత్రాలు చాలా ప్రసిద్ధి. దేవాలయం యొక్క ధ్వజస్తంభం సుమారు 80 అడుగులఎత్తు ఉంటుంది మరియు దీనికి బంగారం పూత పూయబడ్డ రాగిరేకులు తాపడం చేయబడ్డాయి. ఈ దేవాలయంలో బలిపీట మండం మరియు ముఖ మండపం వంటి ఆసక్తి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వివిధ హిందూ దేవతామూర్తుల యొక్క అందమైన శిల్పాలతో ఈ హాళ్లు అలంకరించబడ్డాయి. ఇక్కడ భక్తుల మదిని దోచే మరో నిర్మాణం నవగ్రహ మండపం, దీని యొక్క పై భాగంలో నవగ్రహాలు కనిపిస్తాయి.

కారిడార్
తూర్పువైపు నుంచి ఇది గర్భగుడిలోనికి వెళుతుంది, ఇది చాలా విశాలమైన కారిడర్, దీనిలో అద్భుతమైన చెక్కబడ్డ 365కు పైగా గ్రానైట్ రాతి స్తంభాలుంటాయి. తూర్పు వైపున ప్రధాన ద్వారానికి దిగువన ఉండే గ్రౌండ్ ఫ్లోరుని నాటకశాల అని అంటారు, దీనిలో దేవాలయంలో వార్షికంగా మలయాళం నెలలైన మీనం మరియు తులంలో జరిగే పది రోజుల ఉత్సవాల సమయంలో కేరళ యొక్క సాంస్కృతిక కళారూపమైన కథాకళిని ప్రదర్శిస్తారు.

శ్రీ అనంత పద్మనాభ దేవాలయం తెరిచి ఉండే సమయాలు
ఉదయం వేళలు 03:30 a.m. నుంచి 04:45 a.m.
నిర్మల్య దర్శనం: 06:30 a.m. to 07:00 a.m. 8.30 a.m. to 10:00 a.m. 10:30 a.m. to 11:10 a.m. 11:45 a.m. to 12:00 Noon
సాయంత్రం వేళలు: 05:00 p.m. to 06:15 p.m. 06:45 p.m. to 07:20 p.m.
పండగ సీజన్‌లో దేవాలయం తెరిచి ఉండే సమయాల్లో మార్పులు ఉండవచ్చనే విషయాన్ని దయచేసి గమనించండి.

దేవాలయంలో డ్రెస్ కోడ్ పాటించాలి
కేవలం హిందువులు మాత్రమే దేవాలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతించబడతారు. దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలి. పురుషులు ముండు లేదా ధోతి ( లుంగీ వంటివి) మరియు ఎలాంటి షర్టును ధరించరాదు. మహిళలు చీరలు, ముండమ్ నెరియాత్తం (సెట్- ముండు), లంగా మరియు జాకెట్, లేదా ఓణీలు వేసుకోవచ్చు. దేవాలయం ఆవరణలో ధోతీలు అద్దెకు లభిస్తాయి, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండటం కొరకు ప్యాంట్‌లపై ధోతీలు లేదా చూడీదార్ ధరించేందుకు దేవాలయం అధికారులు ఇప్పుడు అనుమతిస్తున్నారు.

అక్కడకు చేరుకోవడం
దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: తిరువనంతపురం సెంట్రల్, సుమారు 1 కిమీ
ఎయిర్‌పోర్ట్: త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది
మరిన్ని వివరాల కొరకు లాగిన్ అవ్వండి - www.sreepadmanabhaswamytemple.org
Sri Padmanabha Swamy Temple Thiruvananthapuram is one of the 108 Divya Desams (sacred dwellings of Lord Vishnu) and the capital city of Kerala. Lord Vishnu appears in the form of Lord Padmanabhaswamy. The elegant and splendid idol of Lord Vishnu is reclining over a 5 hooded serpent called Anantha. The idol of the Lord is very fascinating as it displays the supreme trinity of Brahma, Vishnu and Shiva. Out of the navel of Lord’s statue a lotus is seen as coming out over which Lord Brahma is sitting. That is why Vishnu is also called Padmanabha, i.e. lotus-navel. Under the right palm of the stretched out hand of Padmanabha there is a Shiva lingum, completing all three powers into one.

Note : 01. Sree Padmanabhaswamy temple can be visited only by the Hindus.
02. There is a strict dress code for temple entrance. For men dhoti without any kind of shirt and women sari or skirt and blouse.
How to go : well connected trains to Thiruvananthapuram . AP people can go from Hyderabad- Vijayawada- nellore-chittor-tirupati-guntur (by train)
Official website: www.sreepadmanabhaswamytemple.org/.

Source: Mana Telangana News, Kerala Tourism, Silicon Andhra, Telugu Kiranam

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.