Skip to main content

పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం | Panchabhuta Shiva Lingam


సకల ప్రాణికోటికి ఆధారం పంచ భూతాలైన గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అంటారు. ఆ పంచ భూతాలకు ప్రతి రూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచ భూత శివలింగాలను పూజిస్తారు.


హిందూ సంస్కృతిలో పరమేశ్వరున్ని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

లింగోద్భవ పుణ్యకాలంలో శివస్మరణ, ముక్తిదాయకమంటారు. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలన్నిటా వ్యాపించి ఉన్న పంచభూతాత్మ స్వరూపుడు, సాకారుడు, నిరాధరుడు అయిన లయకారుడు ఆ మహాశివుడు. ఈ పంచభూతాత్ముని పంచభూతలింగాలు నెలకొన్న పుణ్యక్షేత్రాలు కాంచీపురం, జంబుకేశ్వరం, అరుణాచలం, శ్రీకాళహస్తి, చిదంబరం.

ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడి దివ్య క్షేత్రాలను సందర్శిచేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. కాబట్టి మీ తీర్ధయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనను ఓ భాగం చేసుకోండి. లయ కారకుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ క్షేత్రాల ప్రత్యేకతలు ఏమిటి? ప్రయాణ సమయం? తదితర విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

1. ఆకాశ లింగం:

చెన్నై నుంచి దూరం: 229 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 4 నుంచి 4 ½ గంటలు

పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశ లింగం ఒకటి. ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడి శివలింగాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో 9 గోపురాలు ఉంటాయి. వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ, విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లుకు సంబంధించినది.

ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. శివుడి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు. చంద్రమౌళీశ్వర స్పటిక లింగం, రూపం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లోనూ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు.

పరమేశ్వరుని మూడవ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు. ఈ ప్రదేశాన్ని యంత్రం చిత్రం కలిగిన తెరతో కప్పి ఉంచుతారు. దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది. దీనినే ఆకాశ తత్వానికి ప్రతీకగా భావిస్తారు. తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాల వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తాయి. తెరకు బయట వైపు ఉండే నలుపు అజ్ఞానాన్ని, లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుంది.

2. పృధ్వీ లింగం:

చెన్నై నుంచి దూరం: 72 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 2 గంటలు

కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద గాలి గోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి. ఆలయం లోపల య్యి స్తంభాల నిర్మాణంతో పాటు 1,008 శివలింగాలు ప్రతిష్టించబడ్డాయి. ఇక్కడ 3,500 సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం ఉంది. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఆమ్ర అంటే మామిడి అని అర్ధం. మామిడి చెట్టు కింద వెలసిన దైవం కాబట్టి ఇక్కడి శివలింగాన్ని ఏకాంబరేశ్వర లింగంగా కొలుస్తారు.

3. అగ్ని లింగం:

చెన్నై నుంచి దూరం: 185 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 3 నుంచి 4 గంటలు

తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచలం క్షేత్రం ఉంది. పంచ భూతాలలోని అగ్ని భూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలము అని కొండ అని అర్ధం. దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది. కేవలం స్మరణంతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. వేద, పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కధనం. అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది.

4. జలలింగం:

చెన్నై నుంచి దూరం: 331 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 6 గంటలు

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి 11 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన, ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది. ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన 7 గోపురాలతో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది. నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే పానపట్టంపై ఓ వస్త్రాన్ని కప్పుతారు. దీనిని కొద్ది సేపటి తర్వాత పిండి.. ఆ నీటిని భక్తులకు చూపిస్తారు.

5. వాయు లింగం:

విజయవాడ నుంచి దూరం: 377 కిలోమీటర్లు
ప్రయాణ సమయం: 6 నుంచి 7 గంటలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగాన్ని వాయు భూతానికి ప్రతీకగా కొలుస్తారు. దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు. కర్పూర లింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి. కానీ స్వామి వారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణ వాయు లింగంగా పూజిస్తారు. స్వామి ఉఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని, ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

Sources: Boldsky, Samayam

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.