Skip to main content

Sri Bugga Ramalingeswara Temple - శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం

అందమైన శిల్ప కళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురం కు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్నది తాడిపత్రి.

ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు. క్రీ .శ 1495 ప్రాంతంలో గుత్తి - గండికోట పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు (కొన్ని సంఘటనల అనతరం ) నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు. నీటి బుగ్గ ఉన్న ప్రాంతం లో ఉండటం చేతశివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు పిలువటం వాడుక అయినది. ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సం. రం లో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ, పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.

ఇది పెన్నా నది పడమటి తీరం లో ఉన్నది. ఆలయానికి శిధిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి. శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగం లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురం లో బాగం గానే వినాయకుడికి చిన్నపాటి మందిరం ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణం లో శివాలయం తో పాటు మరో రెండు దేవాలయాలు కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారం తో ఉంటె, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగిఉన్నది. వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది.
తెలంగాణ లో ఇదే " బుగ్గ రామలింగేశ్వర స్వామి " పేరుతొ వికారాబాద్ దగ్గరలో వేరొక ఆలయం ఉన్నది.

శివలింగానికి యోని పిటం లేదు. ఆలయ ప్రాంగణం లో వెనుక గోపురానికి ఎదురుగా ఉన్న మండపం లో శివలింగం ఉన్నది. కొంతమంది భక్తులు శివునికి నీళ్ళ తో అభిషేకం చేస్తున్నారు.

ఇక్కడ కు రావటానికి ముందు చింతల వెంకట రమణుడి ఆలయం. ఇది కూడా బుగ్గ రామలింగెశ్వర ఆలయం తో పాటు నిర్మిత మైనది. ఇక్కడి శ్రీనివాసుడికి చింతల వెంకట రమణుడు అనే పేరు ఎలా వచ్చింది అని అక్కడి వారిని అడిగితే " చింతలు తీర్చే దైవమని, పూర్వం చింత చెట్ల వనాలు ఉండేవని," అనే భిన్న కారణాలు వారు చెప్పారు.

ఈ ఆలయం తూర్పు దిశగా ఉన్నది. వెంకట రమణుడి ప్రధాన ఆలయానికి ప్రక్కనే లక్ష్మి దేవి "ఆనందవల్లి అమ్మవారు" గా చిన్న ఆలయం లో కొలువై ఉన్నది.

తాడిపత్రి కి చేరటానికి మార్గాలు
చెన్నై-రేణిగుంట -గుత్తి రైలు మార్గం లో తాడిపత్రి రైల్వే స్టేషన్ ఉన్నది దేశం లో చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యమున్నది. దగ్గరలో ఉన్న అనంతపురం, కడప ల నుండి రాష్ట్ర ప్రభుత్వ bus ల ద్వారా లేదా taxi ల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. తాడి పత్రీ చిన్నస్థాయి పట్నం ఇక్కడ పరిమితి సౌకర్యాలతో వసతి గల గెస్ట్ హౌస్ ఉన్నాయి. దగ్గరలో ఉన్న రేణిగుంట విమానా శ్రయం 240 కిలోమీటర్లలో ఉన్నది.

తాడిపత్రికి దగ్గరలో ఉన్న సందర్శనీయ ప్రదేశాలు :-
#గుత్తి కోట.. 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది..
యాగంటి:-ఇది కూడా ప్రముఖ శైవక్షేత్రం 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
బేలుం గుహలు:- దేశం లోనే పెద్ద గుహలలో 2వ స్థానం లోఉన్నాయి. యాగంటికి వెళ్ళే మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి .
ఆలూరు కోన :-శ్రీ రంగనాథ స్వామి ఆలయం పెన్నా నదికి ఆవలి వైపున 8కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.