Skip to main content

భక్తి మార్గాలు

భక్తి మార్గాలు ఎన్ని? అవి ఏమిటి? వాటి గురించి వివరించగలరా?

మోక్షం పొందడానికి నవవిధ భక్తి మార్గాలు

మన పురణాలలో ఈ భక్తి మార్గాల గురించి చాలా చక్కగా వివరించారు. మొత్తం తొమ్మిది భక్తి మార్గాలు ఉన్నాయి. వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు. అంటే ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని, దాన్ని వదలకుండా సాధన చేస్తే ఆ భగవంతుని సన్నిధిని చేరుకోవడం సులభం అన్నమాట. దీని గురించి సద్గురు షిరిడి సాయిబాబా కూడా వివరించారు. తన శిష్యురాలు, తాను తల్లిగా భావించే బాయిజాకి అవతార సమాప్తి అయ్యే కొన్ని గంటల ముందు 9 నాణాలను ఇచ్చి, ఈ నవవిధ భక్తి గురించి, దాని ద్వారా ముక్తిని సాధించే మార్గాలను తెలిపారని సాయి సచ్చరిత్ర ద్వారా తెలుస్తోంది.

'శ్రవణం కీర్తన విష్ణోః స్మరణం పాద సేవనం, అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం' అనేవి నవవిధ భక్తి మార్గాలు.

శ్రవణం: ఎల్లప్పుడూ భగవంతుని కథలు, లీలా విశేషాలను వినడం, చదవడం వల్ల ఆ స్వామికి దగ్గరగా నివసిస్తూ ఉండే మార్గం ఇది. ఈ మార్గం ద్వారా భగవంతుని చేరినవారిలో అగ్రేసరుడు పరీక్షిత్.

కీర్తన: ఆ భగవంతునిపై కీర్తనలు రచించడమో, లేదా అలా రచించినవారి కీర్తనలను ఎప్పుడూ స్మరించడం ద్వారా కూడా ముక్తి పొందవచ్చు అని ఈ మార్గం చెప్తోంది. నారదుడు మొదలుకొని అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు ఇలా ఎందరో ఉదాహరణగా నిలిచారు.

స్మరణం: ఇది చాలా గొప్ప మార్గం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆ దేవదేవుని స్మరిస్తే చాలు ఆయన అక్కున చేర్చుకుంటాడట.

పాద సేవనం: అవతార పురుషులుగా ఈ భూమ్మీద ఆ దేవుడు తిరిగినప్పుడు ఆయనకు సీతాదేవి, లక్ష్మణుడు, కృష్ణ అవతారంలో రుక్మిణి, సత్యభామ ఇత్యాదులు ఎందరో తరించారు. మరి మనబోటి వారి సంగతి ఏమిటీ అంటే మానసిక పూజ. ఎల్లప్పుడు మనకి ఇష్టమైన దేవునివో, దేవతవో పాదాలను సేవిస్తున్నట్టుగా మనస్పూర్తిగా సేవించుకుంటే చాలు.

అర్చనం: మన ఎదురుగా ఆ అమ్మవారో, స్వామో కూర్చున్నట్టుగా భావించి, అర్ఘ్య, పాద్యాదుల దగ్గర నుంచీ, నైవేద్యం దాకా అన్నీ మన చేతులతో మనం చేసుకోవడమే అర్చనం.

వందనం: ఎల్లప్పుడూ ఆ దేవుని ఉనిక్ని గుర్తుపెట్టుకుంటూ, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మనే దర్శిస్తూ వినమ్రంగా ఉండటం, ఆయన మనకి ఇచ్చిన ప్రతిదానికీ కృతజ్ఞతగా వంద్నం సమర్పించడం కూడా ఒక మంచి భక్తి మార్గమేనట.

దాస్యం: ఇది చాలా ఆసక్తికరమైన మార్గం. ఆ భగవంతుణ్ణి మనల్ని పాలించే యజమానిగా గుర్తించి, ఆయ్నకి నమ్మిన బంటుగా బ్రతకడమే దాస్యం. ఈ మార్గం ద్వారా చిరంజీవిత్వం పొందిన ఆ ఆంజనేయస్వామే మనకి మార్గదర్శకుడు.

సఖ్యం: అన్నిటికన్నా ఊహాశక్తి, పూనిక, దేవుడి మీద ఎడతెగని ప్రేమ, ఎన్ని కష్టాలనైనా తట్టుకుని నమ్మకం సడలకుండా ఉండగలగడం ఎంతో ముఖ్యం. ఈ మార్గంలో ఆ దేవుణ్ణి మన స్నేహితునిగా భావించాలి. ఈ మార్గం ద్వారా ముక్తిని పొందిన పాండవులు, కుచేలుడు, సుగ్రీవుడు, విభీషణుడు, గోదాదేవి, వెంగమాంబ తదితరులు.

ఆత్మనివేదనం: అఖరిది, అతి ముఖ్యమైనది ఆత్మనివేదనం. 'అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ్' అనడమే ఈ మార్గంలో ప్రధానం.

Comments

Popular posts from this blog

నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu

గమనిక: మీ గురు పరంపరను అనుసరించి కానీ, మీ వంశపారంపర్యంగా కానీ తెలుసుకున్న పూజా విధానాన్ని నమ్మకంతో అనుసరించండి. అవి లేని పక్షంలో శ్రీ పరమేశ్వరుడుని గురువుగా భావించి, ఈ క్రింద ఇచ్చిన విధానాన్ని అనుసరించండి. నిత్య పూజా విధానం – నిత్య పూజా విధానాలు ముఖ్యంగా రెండు- షోడశోపచార పూజ(౧౬ ఉపచారాలు కలవి), పంచోపచార పూజ(౫ ఉపచారాలు కలవి). ఇవి కాక మరికొన్ని పద్ధతులు విశేషమైన తిథులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణముఖతః ఆచరించవచ్చు. ఈ యాప్ లో నిత్య పూజకు వీలుగా రెండు పద్ధతులను వివరించడం జరిగింది. వేరేవి మీ గురువు అనుగ్రహం వల్ల తెలుసుకోగలరు. నిత్య పూజకు కావాలిసినవి – మనస్సులో ధృడ సంకల్పం పసుపు, కుంకుమ, గంధం పసుపు కలిపిన అక్షతలు పువ్వులు, దొరికితే మామిడి ఆకులు తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం) ఘంట, హారతి కర్పూరం, హారతి పళ్ళెం వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె కలశానికి చెంబు, అందులో మంచి నీళ్ళు పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు (ఇవేవీ లభ్యం కాని పక్షం

అరుణాచలం తిరువణ్ణామలై దేవాయలం సమాచారం - Arunachalam Temple Information

అరుణాచలం అరుణాచలేశ్వర దేవాయలం సమాచారం జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలంలో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి. సుమారు 4.30 hrs సమయం పడుతుంది.

Sri Maha Lakshmi Stotram - శ్రీ మహా లక్ష్మి దేవి స్తోత్రములు

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. “యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.